బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు

Spread the love

హైదరాబాద్‌: బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామిక వాడలోని దుకాణంలో ఒడిశా వాసి అనంత కుమార్‌ వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే తనిఖీలు చేపట్టి.. దుకాణంలో 140 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కూలీలు, విద్యార్థులకు వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Related Posts

You cannot copy content of this page