ప్రారంభమైన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు

Spread the love


Physical fitness tests for SSI and Constable candidates have started

్రారంభమైన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు
మొదటి రోజు హజరైన 494 మంది అభ్యర్థులు…
తుది పరీక్షలకు అర్హత సాధించిన 199 మంది అభ్యర్థులు..
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో సజావుగా కొనసాగిన శారీరక ధారుడ్య పరీక్షలు..

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్ట్ఫైండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్స్, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలు సజావుగా కొనసాగిందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. జరిగిన పురుష అభ్యర్థుల శారీరక దారుడ్య పరీక్షలకు 600 మంది అభ్యర్థులకు గాను 494 మంది అభ్యర్థులు హజరైయ్యారని తెలిపారు.

ఇందులో 199 మంది అభ్యర్థులు తుది పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. ఉదయం పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకున్న అభ్యర్థులకు ముందుగా సీరియల్ నెంబర్ ప్రకారం టోకెన్ అందజేశారు. ఆనంతరం యాబై మంది అభ్యర్థులను ఒక్కొక్క బ్యాచ్ గా చేసి డాక్యుమెంట్స్ పరిశీలన కౌంటర్ వద్ద తరలించారు. అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి రిజిస్ట్రేషన్‌ చేసిన తరువాత బయోమెట్రిక్‌ తీసుకున్నారు. ఆనంతరం రిస్ట్‌బాండ్‌ టాగింగ్‌, ఆర్‌ఎఫ్‌ఐడీ చిప్ జాకెట్‌ ధరింపజేశారు. అనంతరం 1,600 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు.


1600 మీటర్ల పరుగు పోటీలో నిర్ణీత సమయంలో లక్ష్యం చేరి అర్హత సాధించినవారికే ఎత్తు కొలతలకు అనుమతించారు. వరుస క్రమంలో నిర్వహించిన ఇవెంట్లలో అర్హత సాధించలేని అభ్యర్థులను నాట్ క్వాలిఫైయింగ్ రిజల్ట్స్ షీట్ అందజేసి ఎగ్జిట్ గేటు నుండి బయటకు పంపించారు.

శారీరక సామర్థ్య పరీక్షలలో ఎలాంటి అవకతవకలు, పొరపాట్లు జరగకుండా క్షేత్రస్ధాయిలో దృష్టి పెట్టి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలలో 32 సీసీ కెమెరాల నిఘా నీడలో జరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. పరుగుపందెంలో పాల్గొనే అభ్యర్థి పరుగు ప్రారంభించిన సమయంతో పాటు, లక్ష్యం చేరుకున్న సమయాన్ని స్పష్టంగా రికార్డు చేసేందుకు ప్రతి అభ్యర్థికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ డివైస్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) చిప్ తో కూడిన జాకెట్‌, చేతికి రిస్ట్‌బాండ్‌లను బిగించారు.


అభ్యర్థుల కోసం పరేడ్ గ్రౌండ్స్ లో మొబైల్ టాయిలెట్స్, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నేటి నుంచి జనవరి 3 వ తేది వరకు జరుగనున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు 24733 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో 4,700 మంది మహిళలు, 20,033 పురుషులు. వీరందరికి షెడ్యూల్‌ ప్రకారం ఆయా రోజుల్లో, నిర్దిష్ట సమయాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page