కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

Spread the love

Patancheru MLA Gudem Mahipal Reddy said that KCR’s decision is historic.

సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
రామచంద్రపురం లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం

రామచంద్రపురం

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు నామకరణం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

ఆదివారం రామచంద్రపురం డివిజన్ పరిధిలోనీ డైమండ్ పాయింట్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ తో పాటు శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఆర్థిక అభ్యున్నతికి దళిత బంధు ప్రవేశపెట్టిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page