పాకాల మండలం, మొగరాల పంచాయతీ భారతమిట్టలో అంగరంగ వైభవంగా కుంభాభిషేకం…

Spread the love

ద్రౌపతి అమ్మవారి ఆలయంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ నుంచి బయటకు రావాలని ప్రత్యేక పూజలు…
కుంభాభిషేకంలో పాల్గొని పట్టు వస్త్రాలను సమర్పించిన పులివర్తి సుధా రెడ్డి…

సాక్షిత : *పాకాల మండలం, మోగరాల పంచాయతీలో భారతంమిట్ట ద్రౌపతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న కుంభాభిషేకంలో పాల్గొని… అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన పులివర్తి సుధా రెడ్డి . ద్రౌపతి అమ్మవారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి అక్కడికి చేరుకున్నారు. హోరెత్తిన డబ్బులు, బాణాసంచా మోతతో గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఆహ్వానం పలికారు. పులివర్తి సుధా రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు అమ్మవారి తీర్థప్రసాదాలను పులివర్తి సుధా రెడ్డి కి అందజేశారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page