ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి ని పార్లమెంటుకు పంపుదాం : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు …

Spread the love

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు , స్థానిక డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా శంభిపూర్ రాజు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిని కొనసాగించాలంటే ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి ని మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పాక్స్ చైర్మన్ ఎం. బాలరెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు, నాయకులు డివిజన్ అధ్యక్షులు,డివిజన్ మహిళా నాయకురాలు,యువ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page