మే 13వ తేదీన కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేద్దాం..!

Spread the love

గడ్డం వంశీకృష్ణ ను పార్లమెంటు పంపిద్దాం..!!

సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి, నారాయణరావు పల్లి , సాంబయ్య పల్లి ,గర్రెపల్లి, బొంతకుంటపల్లి, నరసయ్య పల్లి, నీరుకుల్ల గ్రామాలల్లో ఉదయం పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం గ్రామాలల్లో ఉపాధి హామీ కూలీలను మరియు గ్రామాల ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 5 న్యాయ గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి వంశీకృష్ణ ని భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు ..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ…తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ కేంద్రంలో రాహుల్ ప్రధానమంత్రి చేస్తే ఐదు పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది అన్నారు. స్వామినాథన్ కమిటీ ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధర, ఉపాధి హామీ కూలీలకు రూపాయలు 400 , ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళకు లక్ష రూపాయలు, సంవత్సరముకు 30 లక్షల ఉద్యోగాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 25 లక్షలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇండ్లు లేని వారందరికీ జూన్ 15 నుంచి ఇందిరమ్మ ఇండ్లకు ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు.

Related Posts

You cannot copy content of this page