బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి మన తెలంగాణ గవర్నర్: మంత్రి గంగుల కమలాకర్

Spread the love

సాక్షిత*కరీంనగర్ జిల్లా:
గవర్నర్ తమిళిసై బడు, బలహీన వర్గాల వ్యతిరేకి అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు నామినెట్ చేసిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ, బీసీ వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడం పట్ల మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కరీంనగర్‌లో జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో ఉదయం మంత్రి గంగుల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

గవర్నర్ తమిళసై బడుగు, వర్గాల గురించి అనుసరిస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఆమె భావజాలమా అని ప్రశ్నించారు.

గరవర్నర్ పోస్టుకు తనను నామినేట్ చేసింది బీజేపీయే కదా అని, అప్పుడు ఆమె నేపథ్యం చూడ లేదు కదా? అని అన్నారు..

Related Posts

You cannot copy content of this page