డివిజన్ అభివృద్దే మా ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాం…కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Spread the love

నూతనంగా వేసిన సీసీ. రోడ్లను పరిశీలించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *
శేరిలింగంపల్లి డివిజన్ లోగల లింగంపల్లి విలేజ్ లో నూతనంగా చేపట్టి పూర్తి చేసిన అంతర్గత సీసీ. రోడ్లను లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్ మరియు స్థానిక నాయకుల పిలుపు మేరకు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లింగంపల్లి విలేజ్ లో సీసీ రోడ్లను పర్యవేక్షించారు. అనంతరం లింగంపల్లి విలేజ్ ప్రజల సౌకర్యార్దం లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ రవి యాదవ్ సొంత నిధులతో ఏర్పాటుచేసిన బోరింగ్ ను కార్పొరేటర్ ముఖ్య అతిధులుగా హాజరై బోరింగ్ ను ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ…లింగంపల్లి విలేజ్ లో 90 శాతం సీసీ. రోడ్లు పూర్తయ్యాయని మిగిలిన కొన్నిచోట్ల నూతన సీసీ. రోడ్డు పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే వేసిన ప్రతి రోడ్డును నాణ్యతాయుతంగా ఉన్నాయా లేదా అని అధికారులను పరిశీలించాలని ఆదేశించారు. లింగంపల్లి విలేజ్ లో మౌలిక వసతులలో భాగంగా అన్ని రంగాలలో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. అనంతరం బస్తీ దవాఖాన లో రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. పరిశీలనలో భాగంగా డాక్టర్ల ను రోగులకు సరైన విధానం లో కావలసిన మందులు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖాన కు వచ్చిన పేషెంట్లను పరామర్శించి వారి బాగోగులను అడిగి తెలుసుకుని, బస్తీ దవాఖాన సేవలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, సీనియర్ నాయకులు రాంచందర్, అశోక్, అజీమ్, సుభాష్, విష్ణు వర్ధన్ రెడ్డి, కే రవి, బుయ్య మల్లేష్ గౌడ్, యాదగిరి, రాజారెడ్డి, రాకేష్ దేవులపల్లి, సాయి, హరీష్, విజయ్, సురేష్, రాజు, రేవంత్, మనోజ్, ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page