మా నమ్మకం నువ్వే జగనన్న జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమంలో

Spread the love

బాపట్ల జిల్లా

ఈ రోజు‌ బాపట్లలో ఎమ్మెల్యే శ్రీ కోన రఘుపతి గారి ఆదేశాలమేరకు రాష్ట్ర వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు శ్రీ బందెల కిరణ్ రాజ్ గారితో బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య గారు కలిసి 1వ వార్డు బేతనీ కాలనీ లో మా నమ్మకం నువ్వే జగనన్న.. జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమంలో పాల్గొని ప్రజల ఇంటింటికి తిరిగి స్టిక్కర్లను అంటించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ రాజ్ గారు విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ ప్రజలు సంతోషం తెలియపరుస్తున్నారని అన్నారు.ఈ రాష్ట్రంలో అవగాహన లేని ప్రతిపక్ష పార్టీలు జగనన్న ప్రభుత్వం పైన విమర్శలు చేయటం మానుకోవాలని హితవు పలికారు.ప్రజలకు సంక్షేమ పధకాలు అందిస్తున్న జగనన్న అంటే నమ్మకం అని,చంద్రబాబు దత్తపుత్రుడు ప్యాకేజీ లకు అమ్ముడుబోయే పవన్ కళ్యాణ్ అంటే అమ్మకం అని కిరణ్ రాజ్ విమర్శించారు. యువగళం పేరుతో లోకేష్ చేసే పాదయాత్ర కామెడీ యాత్ర లాగా వుందని ఎద్దేవా చేశారు.రాష్ట్ర ప్రజలకు ఇంత మంచి చేస్తూ అనేక సంక్షేమాలను అందిస్తున్న జగనన్న ప్రభుత్వం ను అభినందిస్తేనే ప్రతిపక్షాలకు రాజకీయ మనుగడ వుంటుందని కిరణ్ రాజ్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో 1వ వార్డు వైసీపీ ఇంచార్జ్ పులుగు చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు ఎన్.రవికుమార్,బేతనీకాలని ప్రెసిడెంట్ పిట్టా రాజారావు, వాలంటీర్ ఎస్.జాన్ తదితరులు గృహసారధులు సచివాలయ కన్వీనర్ లు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page