వైయస్సార్‌ సిపిలోకి కొనసాగుతున్న చేరికలు.

Spread the love

సాక్షిత సత్తెనపల్లి : వైసిపి కండువాకప్పుకున్న ధూళిపాళ్ల తెదేపా కార్యకర్తలు
మంత్రి అంబటి సమక్షంలో పార్టీలో చేరిక

సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత పలు గ్రామాల కీలక సామాజివర్గాల తెదేపా కార్యకర్తలు వైయస్సార్‌ సిపి తీర్ధం పుచ్చుకుంటున్నారు. సత్తెనలపల్లి మండల పరిధిలోని ధూలిపాళ్ల గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్తలు యార్లగడ్డ హనుమంతరావు, కోడెల హుస్సేన్‌ రావు, మరో ఇరువురు తెదేపా పార్టీ సభ్యులు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మండల కన్వీనర్‌ రాయపాటి పురుషోత్తం ఆద్వర్యంలో చేరిన వీరికి మంత్రి అంబటి రాంబాబు స్వయంగా పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. వైయస్సార్‌ సిపిలో చేరిన వారికి సముచిత స్దానం కల్పిస్తామన్నారు. స్దానిక నాయకులతో కలిసి పార్టీ అభివృద్దికి, రానున్న ఎన్నికల్లో విజయానికి కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ నలబోతు శివన్నారాయణ, పల్నాడు జిల్లా ఎస్సీ సెల్‌ అద్యక్షులు చిలకా జైపాల్‌ తదితరులున్నారు.

Related Posts

You cannot copy content of this page