మళ్ళీ బీర్ఎస్ పార్టీ దే హ్యాట్రిక్ విజయం

Spread the love

ప్రజా సమస్యలే పరిష్కారంగా అభివృద్దే లక్ష్యంగా ,ఇంటింటికి సంక్షేమ పథకాలు వివరిస్తూ, అభివృద్ధి ని చూపిస్తూ రాయదుర్గం, గొర్రెక బస్తీ,కట్టెల బస్తీ, ఈగ బస్తీ, SC బస్తీ, ఏండ్ల బస్తీ, పోచమ్మ బస్తీల లో 2వ రోజు జోరుగా కొనసాగిన పాదయాత్ర ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

నా పై నమ్మకం ఉంచి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా మళ్ళీ నన్ను ప్రకటించిన శుభసందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ మంత్రివర్యులు కేటీఆర్ నా హృదయపూర్వక ధన్యవాదాలు

రాష్టంలో మళ్ళీ బీర్ఎస్ పార్టీ దే హైట్రిక్ విజయం .

శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం

9 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. ముచ్చటగా మూడోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబెడుతాను

ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గల రాయదుర్గం,గొర్రెక బస్తీ,కట్టెల బస్తీ, ఈగ బస్తీ, SC బస్తీ, ఏండ్ల బస్తీ, పోచమ్మ బస్తీల లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై ఈ రోజు గౌరవ మాజీ కార్పొరేటర్ శ్రీ సాయి బాబా మరియు GHMC అధికారుల తో కలిసి పాదయాత్ర చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

రాయదుర్గం లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి తదనంతరం పాదయాత్ర చేయడం జరిగినది.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ సంతులిత, సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతామని, అసంపూర్తి గా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ,సమస్యలను పరిగణలోకి తీసుకోని ,వారి విజ్ఞప్తి మేరకు కాలనీ లలో స్వయంగా ఇంటిటికి తిరుగుతూ ప్రజల నుండి తెలుసుకొని సత్వర పరిష్కారమే గా ధ్యేయంగా పనిచేస్తామని ,ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల ను పరిగణలోకి తీసుకొని త్వరితగతిన సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
ఈ రోజు రాయదుర్గం లో పాదయాత్ర చేపట్టడం జరిగినది అని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత , సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.అదేవిధంగా కాలనీలలో క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు,అక్కడికి అక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించడం జరిగినది.అదేవిధంగా కాలనీల లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని మరియు, నాల పూడికతీత పనులు వేగవంతం చేసి,అడ్డంకులను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని, ముఖ్యంగా డ్రైనేజి , రోడ్లు , వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంభందిత సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకరావడం జరిగింది అని.సమస్యలపై ప్రభుత్వ విప్ సానుకూలంగా స్పందించి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు,విద్యుత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.
,మెరుగైన జీవన ప్రమాణాలకు కృషి చేస్తాననిప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు అదేవిధంగా గచ్చిబౌలి డివిజన్ లో 90 శాతం పనులు పూర్తి అయినవి అని మిగిలిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

కాలనీ లలో గడప గడపకు కలియ తిరుగుతూ అవ్వలను ఆప్యాయంగా పలకరిస్తూ ,ఐటి యువకులను మరియు రాజస్థాన్ ,బీహార్ రాష్ట్రల నుండి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారిని ఎంపీ ,ఎమ్మెల్యే పలకరించగా ఇక్కడి ప్రాంతం బాగా అభివృద్ధి చెందినది అని ప్రశాంత వాతావరణంలో కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు, రైతు బంధు ,రైతు బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గొప్ప మనసు తో పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు అని ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ జేజేలు పలుకుతూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి కాలనీ లలో ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది అని , ఎన్నడూ లేని అభివృద్ధి జరిగినది అని కాలనీ లలో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు మంచి నీటికి, కరెంట్ కష్టాలు ఉండేవని బిందెలతో విధులలో ధర్నాలు చేసేవారిమి అని కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందిస్తున్నారు అని, నిత్యం 24 గంటల కరెంట్ ఇస్తున్నారు అని ప్రజలు సంతోషంను వెలిబుచ్చి హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శ్రీనివాస్, DE విశాలాక్షి, AE జగదీష్,వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, వాటర్ వర్స్క్ మేనేజర్ నరేందర్,ఎలక్ట్రికల్ AE షణ్ముఖ రెడ్డి, స్ట్రీట్ లైట్స్ DE మల్లికార్జున్, AE రాజశేఖర్, AmOH నగేష్ నాయక్, శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్ రెడ్డి,టౌన్ ప్లానింగ్ ఏసీపీ మెహ్రా ,TPS రవీందర్, TPS రమేష్ మరియు గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రిప్రగాఢ సత్యనారాయణ ,నరేష్,సంపత్,సతీష్, రమేష్ , రవీందర్ ముదిరాజ్,అశోక్, మల్లేష్, వినోద్, అక్బర్ బాయ్, సల్లావుద్దీన్, సుధీర్,శ్యామ్ లెట్ శ్రీనివాస్,నారాయణ,గోవింద్, అజిమ్,అజ్మద్, రామేశ్వరమ్మ ,విజయ ,కల్పన మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page