అంజయ్య కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన అంతటి పారిజాత నర్సింహా గౌడ్

Spread the love

చిట్యాల సాక్షిత

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన పగిళ్ల అంజయ్య ఇటీవలే మరణించారు. అంజయ్య సంతాప సభ కార్యక్రమానికి బిఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాటం సత్తయ్య అధ్వర్యంలో జిల్లా నాయకులు అంతటి పారిజాత నర్సింహా గౌడ్ పాల్గొని అంజయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా అంతటి పారిజాత నర్సింహా గౌడ్ అంజయ్య కుటుంబానికి 5వేల రూపాయల ఆర్ధిక సాయం అందజేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమం లో సింగిల్ విండో డైరెక్టర్ ఏనుగు రఘుమా రెడ్డి, ఆంజనేయ స్వామి దేవాలయ మాజీ చైర్మన్ గోలి గణేష్, నాయకులు అంతటి రాజు, మారగోని యాదయ్య, కర్దూరి మాల్లారెడ్డి,కర్దూరి అంజిరెడ్డి, గోలి మహేష్, కూరాకుల సురేష్,కంచుకోమ్మల శ్రీను,దొండ యాధయ్య, అంశాల శ్రవణ్,చెరుకు నరేష్,కూరాకుల సుధీర్, కొప్పుల నవీన్ రెడ్డి,మేడి రాజు,ఆరూరి నర్సింహా, గోలి నరేష్,ఆరూరి శివ,రూపని అజిత్, బైకాని స్వామి తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page