కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం-నర్సారెడ్డి భూపతిరెడ్డి

Spread the love

కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం-నర్సారెడ్డి భూపతిరెడ్డి
టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి అప్లికేషన్ ను మరియు బయోడేటాను గాంధీభవన్ లో నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి వెళ్ళి అందచేసిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.పార్టీ అధిష్టానం మరియు టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తనపై నమ్మకం ఉంచి పార్టీ టికెట్ కేటాయిస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,ఏ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి,కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్,దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి,128 డివిజన్ ఇంచార్జ్ ఫలాహ్-ఉర్-రహ్మాన్,రాష్ట్ర మైనారిటీ సెల్ జాయింట్ కన్వీనర్ సమీర్ ఖాన్, ఏ‌ఐ‌సి‌సి హ్యూమన్ రైట్స్ యువజన అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ,రాష్ట్ర ఓ‌బి‌సి సెల్ జాయింట్ కో ఆర్డినేటర్ గడ్డమీది భరత్ గౌడ్,అసెంబ్లీ కో ఆర్డినేటర్ బత్తుల చిరంజీవి,దుండిగల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి పరశురాం గౌడ్,జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి అరుణ్ రెడ్డి,దుండిగల్ మున్సిపాలిటీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొంటు సుమన్,కొంపల్లి మున్సిపాలిటీ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఇబ్రహిం, 127 డివిజన్ ప్రెసిడెంట్ జలీల్ ఖాన్,126 డివిజన్ సోషల్ మీడియా ఇంచార్జ్ గౌతమ్ రెడ్డి,సీనియర్ నాయకులు జయభేరి గోపాల్ రెడ్డి,సంపత్,దుర్గాప్రసాద్,మిద్దెల సీతారాం రెడ్డి, రాకేశ్,లక్ష్మణ్,యువరాజ్,వసీం ఖాన్,జగన్,నరేశ్ గౌడ్,శివ, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page