జాతీయ స్థాయి కబడ్డీ పోటిలకు నాగర్ కర్నూల్ జిల్లా క్రీడాకారుడు .

Spread the love

Nagar Kurnool District Player for National Level Kabaddi Poti

జాతీయ స్థాయి కబడ్డీ పోటిలకు నాగర్ కర్నూల్ జిల్లా క్రీడాకారుడు ఎం. సుధీర్ రెడ్డి ఎంపిక.

సాక్షిత : నాగర్ కర్నూల్ జిల్లా క్రీడా కారుడు ఎం.సుధీర్ రెడ్డి. ఏప్రిల్ 9 వ తేదీ నుంచి 12 తేది వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన 48 వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ జట్టు తరుపున పాల్గోని ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైయడని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి యాదయ్య గౌడ్ తెలిపారు.

ఈ కబడ్డీ క్రీడాకారుడు ఎం. సుధీర్ రెడ్డి ఈనెల 17 నుండి 20 వ తేదీ వరకు హరిద్వార్ లోని రిషికేశ్ లో జరుగుతున్న 48 వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున పాల్గొన్నాడు. ఈ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారున్ని జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ఎం. జనార్ధన్ రెడ్డి అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ కోశాధికారి సీతారాం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ క్రీడాకారుడు హేమంత్ తదితరులు అభినందించడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page