నేటి నుంచి ఎంపీ నామ పర్యటన

Spread the love


MP Nama tour from today

నేటి నుంచి ఎంపీ నామ పర్యటన
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఈ నెల 28, 29 తేదీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తారని ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.28వ తేదీ బుధవారం ఖమ్మం కార్పొరేషన్, కూసుమంచి, జూలూరుపాడు తదితర మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లతో పాటు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, కూసుమంచి మండలం కేశవాపురం, తదితర గ్రామాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.తర్వాత జూలూరుపాడు మండలం గుండేపూడి లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవాలు,

తదితర కార్యక్రమాల్లో నామ స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలసి పాల్గొంటారని క్యాంప్ కార్యాలయం పేర్కొంది. అలాగే 29న చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలాల్లో నామ పర్యటిస్తారని తెలిపింది. ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆత్మీయులు పెద్ద ఎత్తున పాల్గొని, కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎంపీ క్యాంప్ ఆఫీస్ కోరింది.

Related Posts

You cannot copy content of this page