కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని విద్యుత్ సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష…

Spread the love

MLA review with officials on electricity problems in Kutbullapur Constituency…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని విద్యుత్ సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జిహెచ్ఎంసి జంట సర్కిళ్ల పరిధిలో ఉన్న ఎనిమిది డివిజన్ లు, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటిలు మరియు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లలో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ టీఎస్ పీడిసీఎల్, జీహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ విభాగాల అధికారులతో కలిసి పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు బస్తీలు, కాలనీల్లో అక్కడక్కడా నెలకొన్న చిన్నపాటి కరెంటు సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి వహించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.

అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ స్థంబాల బదిలీ, కొత్త స్థంబాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ లు, విద్యుత్ ద్వీపాల వంటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమయ్యే వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి తన దృష్టికి తీసుకువస్తే.. త్వరలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి మంజూరు చేయిస్తానని అన్నారు. ఈ సమావేశంలో డిఈలు నర్సింహా రెడ్డి, చక్రవర్తి, శ్రీనాథ్ రెడ్డి, భిక్షపతి, రఘుపతి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page