కుత్బుల్లాపూర్ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకం : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

Spread the love

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన చేరికల కార్యక్రమంలో గాజులరామారం బిఆర్ఎస్ నాయకులు కిషోర్, శ్రీనివాస్, సాయిబాబా, అజయ్ గుప్తాల ఆధ్వర్యంలో కైసర్ నగర్ సగర సంఘం సభ్యులు 50 మంది ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని అన్ని డివిజన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని రానున్న రోజుల్లో ముచ్చటగా మూడవసారి భారీ మెజార్టీతో గెలిచి మరింత అభివృద్ధి చేస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజా ప్రతినిధులతో పాటు యువకుల పాత్ర ఎంతో కీలకమన్నారు. కావున రానున్న రోజుల్లో అభివృద్ధిని కొనసాగించేందుకు బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : సగర సంఘం అధ్యక్షులు వంశీకృష్ణ, వెంకటేష్, హుస్సేన్, కాశిరాం, లక్ష్మయ్య, చిన్న బలవీరు, బలరాం, జానకిరామ్, కురుమూర్తి, శ్రీనివాస్ జయరాములతో పాటు 50 మంది…

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు విజయ రాంరెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కమలాకర్, చిన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.
……

Whatsapp Image 2023 11 15 At 2.04.35 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page