బిఆర్ఎస్ బిజెపిల మాటలను లను నమ్మొద్దు

Spread the love

ప్రజల సమస్యలను తీర్చే నాయకుడు మల్లు రవిని గెలిపించాలని ఎమ్మెల్యే మేఘ విజ్ఞప్తి

వనపర్తి : బిజెపి, బిఆర్ఎస్ పార్టీల కల్లబొల్లి మాటలను నమ్మొద్దని ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం ప్రజల సమస్యలను తీర్చే నాయకుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి పట్టణంలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారంలో ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజల బ్రతుకులు మారాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని తద్వారా దేశంలో రైతులకు రుణమాఫీ రైతులు పండించిన పంటకు మద్దతు ధర జనగణన జాతీయ ఉపాధి హామీ యువతకు ఉద్యోగ అవకాశాలు లాంటి ఎన్నో అభివృద్ధి పథకాలను అమలుపరచుకొని అభివృద్ధిని సాధించవచ్చు అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నియోజకవర్గ సమన్వయకర్త మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ నంబర్స్ మాజీ కౌన్సిలర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు మత్స్యకార సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ సేవాదళ్ అన్ని వార్డుల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page