రానున్నఎన్నికలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ కే తమ మద్దతు – హిందూ దేవాలయాల కమిటీ సభ్యులు

Spread the love

రానున్నఎన్నికలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ కే తమ మద్దతు – హిందూ దేవాలయాల కమిటీ సభ్యులు..

సాక్షిత : 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధి గురుమూర్తి నగర్ లోని శివాలయం, పోచమ్మ ఆలయం, వెంకటేశ్వరా స్వామీ ఆలయం మరియు ఆంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ నాయకులు, సభ్యులు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ నీ చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసారు.

ఈ సందర్బంగా హిందూ దేవాలయాల అభివ్రిద్ది కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ కాలనీలలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే తమ దేవాలయాల అభివృద్ధికి ఎలా వేళల అందుబాటులో ఉంటూ తన సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియచేసి ఘనంగా సత్కరించారు,

అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో తమ 127 – డివిజన్ హిందూ దేవాలయాల అభివృద్ధి కమిటీ వారి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ, కె పి వివేకానంద్ ని ముచ్చటగా మూడవసారి బారి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెల్పించుకుంటాం కమిటీ నాయకులు, సభ్యులు అందరు ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో శివాలయం కమిటీ ఛైర్మెన్ పి.ఓంకార్ రెడ్డి, ప్రధాన అర్చకులు ట్.ఆంజనేయ శాస్ట్రీ, వెంకటేశ్వరా ఆలయ ఉపాధ్యక్షులు క్రాంతి యాదవ్, పోచమ్మ ఆలయ అధ్యక్షులు టీ. బాలరాజు, ఆంజనేయ ఆలయ కమిటీ అధ్యక్షులు మురుగేష్, మరియు ఇతర కమిటీ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

19f989b4 A122 455b A870 Aecd1f2592e7

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page