SAKSHITHA NEWS

MLA Goodem Mahipal Reddy Tributes to Krishna

 సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ రంగానికి తీరని లోటు 
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 
కృష్ణకు ఘన నివాళులు


సాక్షిత పటాన్చెరు  : సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత సినీరంగం మేరు శిఖరాన్ని కోల్పోయింది అన్నారు
. 
ఈ సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కృష్ణ చిత్రపటానికి ఎమ్మెల్యే జిఎంఆర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కృష్ణ విమాన సంఘం పటాన్చెరు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు
. 
అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ తన చిన్నతనం నుండి నేటి వరకు కృష్ణ అభిమానిగా కొనసాగుతున్నట్లు తెలిపారు. 1982-83 సంవత్సరంలో పటాన్చెరు పట్టణంలో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
350కి పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని అన్నారు 

తెలుగు సినీ రంగాన్ని దశాబ్దాల పాటు ఏలిన మహోన్నత వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ అని కొనియాడారు.
విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా 

SAKSHITHA NEWS