ఎమ్మెల్యేను కలిసిన శ్రీ పట్టాభి రామాంజనేయు స్వామి దేవాలయ కమిటీ సభ్యులు.

Spread the love


Members of Sri Pattabhi Ramanjaneyu Swamy Temple Committee who met the MLA.

ఎమ్మెల్యేను కలిసిన శ్రీ పట్టాభి రామాంజనేయు స్వామి దేవాలయ కమిటీ సభ్యులు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ శ్రీ పట్టాభి రామాంజనేయు స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఈ నెల 21వ తేదీన ఆలయం వద్ద నిర్వహించనున్న శాంతిమంత్ర పఠనం, ప్రాతఃకాల మండప పూజలు, రాజశ్యామల మాల మంత్రం సహిత మూలమంత్ర హోమాలు, ఆవాహన హోమాలు, మహా పూర్ణాహుతి, అవభృద స్నానం, వేద ఆశీర్వచనం కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఎమ్మెల్యే ని ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ ఇంద్రజిత్ రెడ్డి, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page