మడికొండ ఐటీ పార్క్ నిర్వహించిన మెగా జాబ్ మేళా ను సహచర శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి

Spread the love

మడికొండ ఐటీ పార్క్ నిర్వహించిన మెగా జాబ్ మేళా ను సహచర శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు KR నాగరాజు…


సాక్షిత : హనుమకొండ జిల్లా లోని మడికొండ ఐటీ పార్క్ లో క్వాద్రంట్ టెక్నాలజీ సొల్యూషన్ ఐటీ కంపెనీ లో తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సుమారు 36 కంపెనీస్ నిర్వహించిన మెగా జాబ్ మేళను సహచర శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు KR నాగరాజు. ఈ జాబ్ మేళా కి సుమారు 15000 వేల మంది నిరుద్యోగ విద్యార్థులు హాజరు కావడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ 36 కంపెనీల నుంచి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలిపేందుకు ఎందుకు వచ్చినా కంపెనీలో ప్రతినిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప అవకాశం దిన్ని అందరూ సద్వినియోపరుచుకోండి అలాగే ఈ జాబ్ మేళాలలో అవకాశం దొరకని వారు నిరుత్సాహపడకండి ప్రతి ఒక్కరికి జాబ్ కల్పించే బాధ్యత మేము తీసుకుంటానని వారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్వాద్రంట్ టెక్నాలజీ సొల్యూషన్ సీఈఓ వంశీ రెడ్డి మరియు 36 కంపెనీల ప్రతినిధులు మరియు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సభ్యులతో పాటు నిరుద్యోగ విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page