మల్లికార్జున్ కుటుంబాన్ని పరామర్శించి చిత్రపటానికి పూలమాల

Spread the love

Mallikarjun visited the family and garlanded the picture

మల్లికార్జున్ కుటుంబాన్ని పరామర్శించి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న అర్పిస్తున్న కోరంకనకయ్య

మల్లికార్జున్ కుటుంబానికి అండగా ఉంటాం

భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కామేపల్లి మల్లికార్జున్ కుటుంబానికి తాము అండగా ఉంటామని భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య హామీ ఇచ్చారు. మండలంలోని పండితాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మేకల మల్లికార్జున్ దశ దిన కర్మలకు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గురువారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకుల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంలో తృప్తి ఉంటుందని కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తనకు తెలియజేయాలని వారిని ఆదుకోవడంలో ముందుంటానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం యాదవ్. గ్రామ సర్పంచ్ మూడు దుర్గా జ్యోతి కృష్ణ ప్రసాద్, డి సి సి బి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, పగడాల నాగరాజు యాదవ్, చిత్తారు సింహాద్రి యాదవ్, బండారు ప్రభాకరీ యాదవ్, యాదవ సంఘం ఇల్లందు మండల అధ్యక్షులు పుట్ట ఉపేంద్ర యాదవ్, మత్స్య శాఖ అధ్యక్షులు మేకల మల్లిఖార్జున్ యాదవ్,

చింతల పెద్ద వెంకయ్య.రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బానోత్ నరసింహ నాయక్, గ్రామ పెద్దలు శీలం పుల్లయ్య, బండి ఉపేందర్. మేకపోతుల మహేష్ ,ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భుక్యా నాగేంద్రబాబు నాయక్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్, సోమనబోయిన మల్లికార్జున్, బి శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page