లోకేష్ ఓడిపోతాడు చిరంజీవి గెలుస్తాడు.

Spread the love

రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి

మంగళగిరిలో రానున్న ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి నారా లోకేష్ ఓడిపోతాడని వైసిపి తరఫున బరిలోకి దిగుతున్న గంజి చిరంజీవి గెలుస్తాడని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జోష్యం చెప్పారు. ఈనెల 31వ తేదీన సామాజిక సాధికార మహాసభ మంగళగిరి నగరంలో నిర్వహించనుండగా, ఈ సభ రూట్ మ్యాప్ ను విజయ సాయి రెడ్డి సాయంత్రం రాజీవ్ సెంటర్ నుండి కాలినడకన పాత బస్టాండ్ వరకు పాదయాత్రగా వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇప్పటివరకు మంగళగిరి లో తెలుగుదేశం పార్టీ గెలవలేదని అన్నారు.వై ఎస్ ఆర్ సి పి గత రెండు పర్యాయాలు గెలిచిందని రానున్న ఎన్నికల్లో ఇదే కొనసాగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏనాడో చచ్చిపోయిందని ఆయన విమర్శించారు. ఏపీ ని విడదీసి ముక్కలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని అన్నారు.ఈ నెల 31వ తేదీన మిద్దె సెంటర్లో జరిగే సామాజిక సాధికార మహాసభను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.

Whatsapp Image 2024 01 24 At 8.34.23 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page