కుత్బల్లాపూర్ నియోజకవర్గ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్

Spread the love

కుత్బల్లాపూర్ నియోజకవర్గ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆత్మీయ సహవాసము లో పాల్గొన కె పి వివేకానంద్.

కుత్బల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ శ్రీరామ్ నగర్ పరిధిలోని కుత్బల్లాపూర్ నియోజకవర్గ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఆత్మీయ సహవాసము కార్యక్రమానికి ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్యతిదిగా పాల్గొన్నారు. రానున్న ఎన్నికలో కుత్బల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కె.పి వివేకానంద కే ఓటు వేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి బారి మెజారిటీతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని ప్రార్ధించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు కులాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సముచిత గౌరవం కల్పిస్తున్నారని.. క్రైస్తవుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరులకు ఎటువంటి సహాయ సహకరాలకైనా ముందుంటామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస యాదవ్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కమలాకర్, జి అశోక్, చిన్న చౌదరి, తిరుపతి, కుత్బల్లాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ గోడి శేఖర్, ప్రెసిడెంట్ కె జాన్ క్రీస్తు దాస్, సెక్రటరీ పి సిమోన్ రాజు, కౌశదీకరి సి ఎహ్ థామస్, వైస్ ప్రెసిడెంట్ ఏ ఎస్ పాల్, జాయింట్ సెక్రటరీ పి డేవిడ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ డి వీరయ్య, పి సంజీవ్, అర్గనైజింగ్ సెక్రటరీ జి రాజశేఖర్ మరియు సంగం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page