వైసీపీ సీనియర్ నాయకులు జక్కారెడ్డి, కృష్ణారెడ్డి, ప్రశాంతి రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిక

Spread the love

సాక్షిత : కోవూరు ఆడపడుచుని, ఇక్కడ అవినీతి లేకుండా చేస్తా ..

100 కుటుంబాలకు పైగా చేరిక

కోవూరు టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన వైసీపీ సీనియర్ నాయకులు జక్కం రెడ్డి కృష్ణారెడ్డి, కాటం
రెడ్డి కృష్ణారెడ్డితో ఆయన అనుచరులు,100 కుటుంబాలకు పైగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,అనంతరం వారు మాట్లాడుతూ ఇంత భారీగా తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని మీ ఇంటి ఆడపడుచుని నన్ను ఆశీర్వదించండి అని కోవూరు నియోజకవర్గాన్ని, అవినీతి రహిత,వివాదరహిత నియోజకవర్గంగా చేస్తానని మీకు మాటిస్తున్నాను నేను మీలో మనిషిని, మా ఇంటి గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంతా మల్లారెడ్డి, గోపిరెడ్డి, పెంచలయ్య సూరిశెట్టి శ్రీనివాసులు, నాగరాజు, సుధాకర్ రెడ్డి, నాటక రాణి వెంకట్, షేక్ ఫిరోజ్, అశోక్, వెంకటేశ్వర్లు, బాల రవి, హరి వెంకట రమణమ్మ, నారాయణ, మరియు టీడీపీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది*.

Related Posts

You cannot copy content of this page