బైకు బుక్‌ చేస్తే మోసం చేశారు!

Spread the love

If you book a bike, you are cheated!

బైకు బుక్‌ చేస్తే మోసం చేశారు!

పోలీసు స్పందనకు 56 ఫిర్యాదులు
ఫిర్యాదుదారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీ మలికాగార్గ్‌

ఒంగోలు: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మలికా గార్గ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందనలో అర్జీలు ఇచ్చేందుకు వివిధ ప్రాంతాల వారు తరలివచ్చారు.ఆన్‌లైన్‌లో రూ.1.90 లక్షలు చెల్లించి ఎలక్ట్రిక్‌ బైక్‌ బుక్‌ చేస్తే తనకు వాహనం ఇవ్వకుండా మోసం చేశారని చెల్లించిన మొత్తం కూడా తిరిగి ఇవ్వలేదని తర్లుపాడు మండలం మీర్జాపేటకు చెందిన ఆర్‌.సుబ్బారావు ఫిర్యాదు చేశారు.


చనిపోయిన తన మామ పేరిట ఉన్న స్థలాన్ని అత్త పేరిట మార్పిస్తానంటూ చీరాలకు చెందిన బి.అజయ్‌ రూ.4.30 లక్షలు తీసుకుని మోసగించాడని నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరానికి చెందిన బచ్చుల మరియదాసు ఫిర్యాదు చేశారు.పోలీసు స్పందనకు మొత్తం 56 ఫిర్యాదులు అందాయి.

వీటిని సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.అదనపు ఎస్పీలు కె.నాగేశ్వరరావు (అడ్మిన్‌),ఎస్‌.వి.శ్రీధర్‌రావు (క్రైమ్‌),ఎస్‌బీ డీఎస్పీ మరియదాసు,ఐసీసీఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వి.రాఘవేంద్ర, ప్యానల్‌ అడ్వకేట్‌ బి.వి.శివరామకృష్ణ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page