ఐ.ఎస్. జగన్నాధపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి తానేటి వనిత

Spread the love

ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాధపురం కొండపై శ్రీ లక్ష్మి నరింహస్వామి వారిని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత దర్శించుకున్నారు.. హోంమంత్రికి దేవస్థాన అధికారులు ఆలయ లాంచనాలతో స్వాగతం పలికి స్వామి వారి దర్శనం కల్పించారు. స్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రికి వేద ఆశీర్వాదం అండించారు.

ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనితకు స్వామి వారి ప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు. స్వామి వారి కరుణా, కటాక్షాలతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా, సంతోషంగా జీవించాలని ఆమె కోరుకున్నారు. అనంతరం ద్వారకా తిరుమల మండలంలో గ్రామాల పర్యటనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జారీచేసిన వారు : హోంమంత్రి క్యాంపు కార్యాలయం, యర్నగూడెం.

Related Posts

You cannot copy content of this page