వినుకొండ నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమనులందరికీ రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు

Spread the love

వినుకొండ నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమనులందరికీ రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు
వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు .


సాక్షిత : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్ లో గల ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక పార్ధన లో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొంన్నారు.

ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని ముస్లిం సోదర, సోదరీమనులందరికీ రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలిపారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని, ప్రతి ఒక్కరూ ఆయు-ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదర, సోదరీమనులంతా నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్టగా అల్లాహ్ ను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని శాసనసభ్యుల వారు అన్నారు. అల్లాహ్ రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్‌ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని, ప్రతి ఒక్కరూ ఫిత్రా మరియు జకాత్ రూపంలో ఉన్నదానిలో ఎంతోకొంత దానధర్మాలు చేస్తారని, సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకొంటారని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. అలాగే మైనార్టీ ల బంధువు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని గుర్తుచేశారు. వినుకొండ పట్టణంలోని NSP కాలనీ నందు 5 ఎకరాల్లో మైనార్టీ ల కోరకు స్కూల్, కాలేజీ, హాస్టల్ ను నిర్మించేందుకు ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలు అందించినందుకు వారికి మైనార్టీ ల తరపున శుభాకాంక్షలు తెలిపారు

Related Posts

You cannot copy content of this page