టిఆర్ఎస్ నియంత పాలనకు చరన గీతం పాడాలి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి

Spread the love

రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశానుసారం పటాన్చెరువు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముట్టడి లో భాగంగా రామచంద్రపురం పట్టణంలో రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజి రెడ్డి 300వందల బిజెపి నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి వెళుతున్న సందర్భంలో రామచంద్రపురం లోని పోలీసులు అక్రమ అరెస్టు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం నియంత పాలన కొనసాగుతుందని పోలీసులతో అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమం ఆపలేరని రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తలేదని దానికి నిరసనగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కు వెళ్తున్న సందర్భంగా పోలీస్ అక్రమం అరెస్టు చేయడం దారుణం అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటివరకు డబల్ బెడ్ రూమ్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని అన్నారు.

రాష్ట్రంలో దుర్మార్గ పాలన రాక్షసి పాలన నడుస్తుంది అని త్వరలోనే టిఆర్ఎస్ పార్టీకి చరన గీతం పడతారని అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు అంజిరెడ్డి మరియు దేవేందర్ రెడ్డి, బిజెపి నాయకులు భూపాల్ రెడ్డి రాజు బీజేవైఎం అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్ రామచంద్రాపురం మహిళా అధ్యక్షురాలు పూర్ణిమ భారతి నగర్ డివిజన్ ఉపాధ్యక్షురాలు గీత బసవమ్మ రజిని శరత్, పెంట రెడ్డి కృష్ణారెడ్డి నాగిరెడ్డి సత్యనారాయణ యాదిరెడ్డి మురళీధర్ రెడ్డి. నాదరెడ్డి.లక్ష్మణ్ గౌడ్. నారాయణ రావు.కటిక శ్రీను తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page