గురు గోవింద్ సింగ్ నగర్ కాలనీలో పర్యటించిన జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ మమత మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ *

Spread the love

సాక్షిత : 124 డివిజన్ పరిధిలోని పి జె ఆర్ నగర్ కాలనీ మరియు గురు గోవింద్ సింగ్ కాలనీలో వరద నీరు రోడ్లమీద పొంగి ప్రవహిస్తుండడంతో నిన్నటి నుండి కొనసాగుతున్న సహాయక చర్యలలో భాగంగా కూకట్పల్లి జోన్ జోనల్ కమిషనర్ శ్రీమతి వి.మమత , స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ , ఎస్ఐ శ్రీకాంత్ , మరియు మాన్ సూన్ సిబ్బంది తో కలిసి వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి, ఇంటింటికి వెళ్లి పరిస్థితులను మరియు సహాయక పనులను పరిశీలించడం జరిగింది.

జోనల్ కమిషనర్ మమత కాలనీ వాసులతో స్వయంగా మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. కాలనీ ప్రజలు మాట్లాడుతూ నిన్నటి కన్నా పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని, నిన్న చాలా ఇళ్లలో ఉన్న వరద నీరు క్లియర్ అయ్యిందని, విపత్తు సమయంలో వెంటనే సహాయ చర్యలు అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ కి, జిహెచ్ఎంసి సిబ్బందికి మరియు పోలీస్ శాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఎఇ శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, యాదగిరి, సంగమేష్, పోశెట్టిగౌడ్, వాసుదేవరావు, మారుతి, రాజు, పద్మయ్య, సూపర్వైజర్ శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page