ఖమ్మాన్ని మరింత అభివృద్ధి
చేసుకుందాం

Spread the love

Further development of Khamma Let’s do it

ఖమ్మాన్ని మరింత అభివృద్ధి
చేసుకుందాం

సారధినగర్ రైల్వే బ్రిడ్జి పై
దృష్టి పెట్టాలి

ఖమ్మం కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగర మున్సిపాలిటీ అభివృద్ధి లో రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, అందరం కలిసి మరింత అభివృద్ధి చేసుకుందామని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఖమ్మం కార్పొరేషన్ సర్వ సభ్య సమావేశంలో ఎంపీ నామ మాట్లాడారు.

8 ఏళ్ల సీఎం కేసీఆర్ పాలనలో ఖమ్మం తో పాటు యావత్ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధిని సాదించిందన్నారు. ఇదంతా కేసీఆర్ చలువవేనన్నారు.75 ఏళ్లలో జరగని అభివృద్ధిని నేడు కళ్లారా చూస్తున్నామని, ఇది ఒక చరిత్ర అన్నారు.ఎంపీ గా ఖమ్మం అభివృద్ధిలో తాను కీలకపాత్ర నిర్వహించినట్లు చెప్పారు.

కేంద్రంపై వత్తిడి తెచ్చి ,పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించడం జరిగిందని చెప్పారు. పదవులు, డబ్బు శాశ్వతం కాదు.. చివరికి మనం చేసిన పనులే ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని అన్నారు.ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, వాటిని సామరస్యంగా సమావేశాల ద్వారా పరిష్కరించుకోవాలని సభ్యులకు సూచించారు.

రాబోయే కాలంలో మరింత అభివృద్ధికి కేసీఆర్ కు అండగా నిలవాలన్నారు.ఖమ్మం సారధినగర్ రైల్వే అండర్ బ్రిడ్జికి సంబందించి ఏర్పడిన కోర్ట్ కేసు సమస్యను సత్వర పరిస్కారానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నామ మున్సిపల్ మేయర్ ను, కమిషనర్ ను కోరారు.

ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ రైల్వే బ్రిడ్జి విషయం లో ప్రత్యేక దృష్టి పెట్టాలని నామ సూచించారు. ఈ సందర్భంగా నామను శాలువా తో సన్మానించి, ఘనంగా స్వాగతం పలికారు.కార్యక్రమంలో మేయర్ నీరజ, కమీషనర్ సురభి, పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page