ఖమ్మం నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

Spread the love

Former MP Ponguleti’s visit to Khammam Constituency

ఖమ్మం నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రఘునాథపాలెం మండలంలోని వి.వి. పాలెం, ఖమ్మం నగరంలోని జి.ఆర్.ఆర్ శ్రీనివాసం, వై.ఎస్.ఆర్ కాలనీ, కొత్త మున్సిపాలిటీ, గాంధీచౌక్, బోనకల్ రోడ్, కిన్నెరసాని థియేటర్ రోడ్, బల్లేపల్లి, ఎస్.ఆర్ కన్వెన్షన్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

ఆయా ప్రాంతాల్లో జరిగిన వివాహాది శుభకార్యక్రమాలు, నూతన గృహప్రవేశ వేడుకలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలతో పాటు పలువురి దశదిన కర్మలకు పొంగులేటి హాజరయ్యారు. అదేవిధంగా ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్నారు.

పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కార్పొరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, దుంపల రవి కుమార్, మైనారిటీ నాయకులు షేక్ ఇమామ్ భాయ్, చింతమళ్ల గురుమూర్తి, తాళ్ళూరి రాము, అజ్మీరా అశోక్ నాయక్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎయిర్టెల్ నర్సింహారావు, బోడా శ్రావణ్, మొగిలిచర్ల సైదులు, బందెల గోపి, బాణోత్ పాపానాయక్ తదితరులు ఉన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page