దుండిగల్ మండల వీఆర్ఎ ల నిరవధిక సమ్మెకు హాజరై, సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love

దుండిగల్ మండల వీఆర్ఎ ల నిరవధిక సమ్మెకు హాజరై, సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *

సాక్షిత దుండిగల్: వీఆర్ఏ లు గత 41 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు స్పందించకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. దుండిగల్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద 41 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు సంఘీభావం తెలిపి, అనంతరం ఆయన మాట్లాడారు. వీఆర్ఏల కు పే స్కేల్ ఇస్తానని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి, మాట తప్పడం శోచనీయమని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం నాయకులు నరేష్, యాదగిరి, దుండిగల్ బిజెపి అధ్యక్షులు మల్లేష్ యాదవ్, కౌన్సిలర్ రాము గౌడ్, బీజేపీ నాయకులు శ్రీశైలం యాదవ్, పిట్ల లక్ష్మణ్, చారి వెంకటేష్, వీఆర్ఏలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page