సాయి బాబా ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్.సి. ఎల్ నార్త్ ఎవెన్యూ కాలనీ లొ గల సాయి బాబా ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బాబాను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సాయిబాబా ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న శౌచాలయాలను స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారనే విషయాన్నీ కాలనీ వాసులు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకురావడంతో, స్థానికులతో కలిసి వాటిని పరిశీలించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ఆలయాల జోలికెస్తే ఊరుకొనేది లేదని ఆయన హెచ్చరించారు.

ఆలయాల అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే మీకు గుణపాఠం చెప్తారని అన్నారు. ఆలయాలకు గులాబీ రంగులేసి, కబ్జా చేయాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీలకతీతంగా ఆలయాలు అభివృద్ధి జరగాలి, కానీ ఆలయ కమిటీల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు జోక్యం చేసుకోవడం విడ్డురంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, బీజేపి నేతలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page