స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ .

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ లో వల్లపు వేణు ఆధ్వర్యంలో జరిగిన స్వామి వివేకానంద జయంతి వేడుకలకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహిళలకు వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశ ఆధ్యాత్మిక విలువలను చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. ఆయన బోధనలు ప్రసంగాలు యువతకు ఎంతో స్ఫూర్తిని చైతన్యాన్ని కలిగిస్తాయని అందుకే ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవం గా జరుపుకుంటున్నామని అన్నారు. ఆ మహనీయుడు ఆలోచనలు బోధనల నుండి ప్రతి యువకుడు స్ఫూర్తి పొంది జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద విగ్రహ కమిటీ సభ్యులు మోతే శ్రీనివాస్ యాదవ్ , స్థానిక బీజేపీ నాయకులు పరుష వేణు, ఏరువ వెంకటరమణ రమేష్ మంజుల్కర్, బాలరాజు, రంగా శ్రీనివాస్ గౌడ్, రమణారెడ్డి, నాగన్న, రాకేష్, నాగేందర్ రెడ్డి, ప్రవీణ్, జూల సందీప్,సంజయ్, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 12 At 1.05.25 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page