మాజీ ప్రధాని పీవీ కి భారత రత్న ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ మంత్రి పువ్వాడ.

Spread the love

దేశ ఆర్ధిక రంగ పితామహుడు, తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర సన్మానం భారతరత్నను ప్రకటించడం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం చేశారు.
దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి పీవీ అని, సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడని అన్నారు.
పీవీ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానికి భారతరత్న ఇవ్వాలని అనేక మార్లు బిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన విషయం గుర్తు చేశారు. దేశ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు పీవీ స్ఫూర్తిదాయకమని, వారికి భారతరత్న ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి పువ్వాడ ధన్యవాదాలు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page