క్రీడల్లో గెలుపోటములు సహజమే: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ రాజు నాయక్

Spread the love

శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామ క్రీడా ప్రాంగణ పరిధిలో ఆర్ఎన్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో  నిర్వహించిన చేవెళ్ల నియోజకవర్గ  (పురుషుల ) వాలీబాల్‌ పోటీలు శనివారంతో ముగిశాయి. మోకిల తాండ, మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ మధ్య హోరా హోరీగా సాగాయి. పురుషుల విభాగంలో ప్రథమ స్థానంలో అజిత్ నగర్ జట్టు, ద్వితీయస్థానంలో మోకిలా తాండ  జట్టు, నిలిచి గెలుపొందాయి. ప్రథమ స్థానం గెలిచిన అజిత్ నగర్ జట్టు కు 25వేల ప్రైజ్ మనీ మరియు ట్రోఫీ అలాగే ద్వితీయ నిలిచిన జట్టుకు 15000 ప్రైజ్ మనీ మరియు రన్నర్ ట్రోఫీని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ రాజ్ నాయక్ స్పాన్సర్ చేసిన గోపాల్ నాయక్ తో ఇరుజట్లకు బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపోటములు సహజమేనని .. క్రీడాలో మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఆయన అన్నారు. యువత గ్రామస్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన యువకులకు సూచించారు.అలాగే ముందుండి టోర్నమెంట్ నిర్వహించిన గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు స్టేట్ అవార్డు గ్రహీత ఆశీర్వాదం, రాకేష్ నాయక్,గోపాల్ నాయక్ లను అభినందించారు. కార్యక్రమంలో రాకేష్ నాయక్ హనుమంతు జమ్మల, శంకర్, హనుమంతు మహేందర్, నామ్య పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 13 At 6.50.47 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page