సబితా ఆనంద్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం

Spread the love

సాక్షిత : వికారాబాద్ మండలం గోధుమగూడ గ్రామంలో వర్షాలతో ఇండ్లు కూలిపోయినటువంటి కావలి శంకరమ్మ, ఎదురే నర్సమ్మ, ఈడిగి, రామచంద్రయ్య, ప్యాట యాదయ్య లకు “సబితా ఆనంద్ ఫౌండేషన్” ద్వారా గ్రామస్తులు ఒక్కొక్కరికి Rs. 5000 రూపాయల చొప్పున మొత్తం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భర్త సత్యయ్య గౌడ్, వార్డు మెంబర్ అనంతయ్య, గ్రామ అధ్యక్షులు సుభాన్ రెడ్డి, డైరెక్టర్ శివకుమార్, కో ఆప్షన్ సభ్యులు యాదయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page