రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు – యస్.పి అపూర్వ రావు

Spread the love

రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు – యస్.పి అపూర్వ రావు

— నకిలీ విత్తనాల నివారణ పై ప్రత్యేక నిఘా

— జిల్లా పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో వీడియో కాన్ఫరెన్స్

— నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు – యస్.పి

నల్లగొండ సాక్షిత ప్రతినిధి

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని యస్.పి అపూర్వరావు తెలిపారు. పోలీసు శాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో వానాకాలం సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా, నకిలీ విత్తనాలు నివారణ అంశంపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి మాట్లాడుతూ నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోక ముందే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని దీని కోసం జిల్లా లోని ప్రతీ సబ్ డివిషన్,సర్కిల్,మండల స్థాయిలలో పోలీస్ మరియు వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని వీరు 24 గంటలు అందుబాటులో ఉంటూ నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారి పట్ల నిఘా పెడుతూ కేసులు నమోదు చేయబడతాయని అన్నారు.

డీలర్లు తాము అమ్ముతున్న విత్తనాల షాప్ లలో స్టాక్ బోర్డులు,లైసెన్సులు తప్పని సరిగ్గా ప్రదర్చించేలా చర్యలు తీసుకోవాలని,స్టాక్ రిజిస్టర్,బిల్ రిజిస్టర్స్ సక్రమంగా నిర్వహించేలా చెక్ చేయాలని, విడి విత్తనాలు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని, విత్తనాల ప్యాకెట్లు పైన లేబుల్ పరిశీలించి గడువు దాటినా విత్తనాలను అమ్మకుండా, గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలను అమ్మేల చర్యలు తీసుకోవాలని అన్నారు. నకిలీ విత్తనాల పైన రైతుల కు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో సంబంధం ఉన్నవారి పై నిఘా ఉంచాలని అన్నారు.ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మే వారిపైన పి.డి ఆక్ట్ కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు. రైతులు విత్తనాలు కొనే ముందు నాణ్యమైన విత్తనాలు మాత్రమే కొనాలని నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి కె అర్ కె ప్రసాద రావు, డిఎస్పీ లు, సీఐలు, ఎస్ ఐ లు వ్యవసాయ శాఖ అధికారి వై.సుచరిత, ఎ డియే ల హుస్సేన్ బాబు, ఎఓ
కీర్తి, అన్ని మండలాల వ్యవసాయ అధికారులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page