ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ ఆధ్వర్యంలో నిరుపేద,బడుగు బలహీనర్గాలకు మరియు నిరుపేద విద్యార్థులకు, నిత్యవసర సరుకులు, కూరగాయలు మరియు పుస్తకాల పంపిణీ

Spread the love

ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ ఆధ్వర్యంలో నిరుపేద,బడుగు బలహీనర్గాలకు మరియు నిరుపేద విద్యార్థులకు, నిత్యవసర సరుకులు, కూరగాయలు మరియు పుస్తకాల పంపిణీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగరం లో ఆకాశనంటిన ధరలను దృష్టిలో పెట్టుకొని, నిరుపేద, బడుగు బలహీనవర్గాలకు తోడ్పాటు అందిస్తూ పల్లా కిరణ్ అధ్వర్యంలో సుమారు 150 కుటుంబాలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేయటం జరిగింది (టమాటా, కందిపప్పు, నూనె ప్యాకిట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఆలుగడ్డలు మరియు తదితర వస్తువులు )దీనితో పాటు ఆర్థిక స్తోమతలేక చదువుకుంటున్న పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేయుట జరిగింది .

ఈ కార్యక్రమంలో పల్లా కిరణ్ మాట్లాడుతు, గత 17 సంవత్సరాలు గా నిరుపేద బడుగు బలహీన వర్గాలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారికి అన్ని రకాల సేవలతో తోడ్పాటు అందిస్తూ, ప్రజలలో ఉండటం జరుగుతుంది. నాన్న పల్లా జాన్ రాములు అడుగుజాడల్లో నడుస్తూ, నా వంతు ప్రజలకు సేవ చేస్తున్నందుకు ఎంతగానో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సేవల్ని అందుకున్న ప్రజలు పల్లా కిరణ్ కుమార్ ని నిండు మనసుతో ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం ఎస్పీ ఆఫీస్ రోడ్ నందు పల్లా కిరణ్ నివాసం వద్ద జరిగింది.

Related Posts

You cannot copy content of this page