పేద ప్రజలకు అన్ని సంక్షేమ పధకాలు లభించేలా కృషి

Spread the love

పేద ప్రజలకు అన్ని సంక్షేమ పధకాలు లభించేలా కృషి చేస్తామని సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.


సాక్షిత : సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో వివిధ మున్సిపల్ డివిజన్లకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎం ఎల్ ఏ పద్మారావు గౌడ్ సితాఫలమండీ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో సంక్షేమ పధకాలను అందించాగాలిగామని, అన్ని వర్గాలకు చెందిన వారికీ ప్రయోజనం చేకూర్చ గలిగామని తెలిపారు.

ఓట్లు, ఎన్నికలు, రాజకీయాలతో నిమిత్తం లేకుండా అన్ని వేళల్లో ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నామని పద్మారావు గౌడ్ అన్నారు. భవిషత్తులో కూడా అదే పద్దతిని కొనసాగిస్తామని, సితాఫలమండీ లోని తమ కార్యాలయం పేదల సమస్యల పరిష్కార కేంద్రంగా కొనసాగుతుందని తెలిపారు. కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, నేతలు లింగాని శ్రీనివాస్, డిప్యూటీ తాసిల్దార్ శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తమకు రావాల్సిన చేక్కులకు ప్రజలు ఎవరికీ డబ్బులు చెల్లించరాదని పద్మారావు గౌడ్ సూచించారు. 27 మందికి కళ్యాణ లక్ష్మి దాదాపు 27 లక్షల రూపాయల విలువచేసే చెక్కులను ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ అందించారు.

Whatsapp Image 2024 01 06 At 3.43.40 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page