తక్షణమే డీఎస్సీ.గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయాలి

Spread the love

ప్రకాశం జిల్లా దర్శి

తక్షణమే డీఎస్సీ.గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయాలి…… డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కే వి పిచ్చయ్య…. డీఎస్సీ ని వెంటనే విడుదల చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నా 25 వేల టీచర్ పోస్టుల్ని భర్తీ చేయాలని కోరుతూ దర్శి లోనీ తాహాసిల్దార్ శ్రావణ్ కుమార్ కి డివైఎఫ్ఐ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కే వి పిచ్చయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరము రాష్ట్రంలో ఖాళీ అయ్యే ఉద్యోగాలతో కలిపి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు కావస్తున్న ఒక్క డీఎస్సీ. గ్రూప్ 2 ట్రాన్స్కో సివిల్ ఏఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఎక్కడ డీఎస్సీ గ్రూప్ 2 ట్రాన్స్కో నోటిఫికేషన్లు అని ప్రశ్నించారు.రాష్ట్రంలో 56 వేల ఉపాధ్యాయ పోస్టులు అవసరం కాగా రేస్నాలైజేషన్ పేరుతో 30 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను ఊడగొట్టాడని తెలిపారు.తక్షణమే 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలకు మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5600 గ్రూప్ 2 ఉద్యోగాలకు ట్రాన్స్కో లో ఏఈ ఉద్యోగాలకు కూడా తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యార్థి యువజన సంఘాలు నిరుద్యోగులతో కలిసి పోరాటాలను ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ సమావేశంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు ఆర్ జె సి పాల్. నాయకులు షేక్ పి సాహెబ్. వెంకటేశ్వర్లు. తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page