శంకర్‌పల్లి లో ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

Spread the love

సాక్షిత : సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘసంస్కర్త డా. బాబు జగ్జీవన్ రామ్ అని మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అరుణోదయ క్లబ్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చైర్మన్ మాట్లాడుతూ సమసమాజ స్థాపనకై కృషి చేసిన కృషీవలుడు జగ్జీవన్ రామ్ అని తెలిపారు. అరుణోదయ క్లబ్ అధ్యక్షులు పాండురంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ప్రకాష్, కౌన్సిలర్ చంద్రమౌళి, నాయకులు గోపాల్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, కాశెట్టి మోహన్, ప్రవీణ్ కుమార్, మోహన్ రెడ్డి, యాదయ్య గౌడ్, చిన్న, శ్రీనివాస్, ప్రసాద్, రఘునందన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సంజిత్ కుమార్, అంజిరెడ్డి రంపల్ ఉన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page