దేశానికి భరోసాగా ఉండేది బీజేపీ పార్టీయే : డీకే అరుణ

Spread the love

మహబూబ్ నగర్: మన దేశానికి భరోసాగా ఉండేది, రక్షణగా నిలిచేది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.మంగళవారం పద్మావతి కాలనీ లోని ఆమె స్వగృహంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు నుంచి యువత పెద్ద ఎత్తున బీజేపీ లో చేరిన సందర్భంగా వారికి బీజేపీ కండువాతో పార్టీలోకి ఆహ్వానించి, అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ హామీలు మోసపూరిత మైనవని, ఆరు గ్యారెంటీ లోని మొదటి గ్యారెంటీ లో ఉన్న మూడు అంశాల్లో ఒక్కటి మాత్రమే అమలు చేసి, రెండు గ్యారెంటీలను అమలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారని, వారి హామీల అమలులో చిత్తశుద్ధి కనబడటం లేదని ఆమె ఆరోపించారు. యువత భవిష్యత్తుకు బాటలు వేసేది ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమేనని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంటు సీట్లలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

Related Posts

You cannot copy content of this page