పారిశుధ్య కార్మికులకు శానిటేషన్ కిట్లను పంపిణీ

Spread the love


Distribution of sanitation kits to sanitation workers

సాక్షిత : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆవిష్కరించారు.

అనంతరం పారిశుధ్య కార్మికులకు శానిటేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలన్ నీలాగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కమిషనర్ వంశీకృష్ణ, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ తెరాస పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు, తెరాస కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, సిబ్బంది, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page