పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

Spread the love

రాబోయే 10వ తరగతి పరీక్షలను పురస్కరించుకుని ఖమ్మం సత్యసాయి సేవా సమితి పరిధిలోని పలు గ్రామాల్లోని పాతర్లపాడు, నేరడ, లచ్చగూడెం, బల్లేపల్లి, రోటరీ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, స్కేల్ మరియు పెన్ను మొదలగునవి పరీక్షలకు ఉపయోగపడే విధంగా వితరణ చేయడం జరిగినది. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి ఖమ్మం సమితి కన్వీనర్ ఆలస్యం నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాకుండా ఆటల్లో కూడా ముందంజలో ఉండాలన్నారు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా పాల్గొనాలని అన్నారు. వార్షిక పరీక్షలు కు అందరూ కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని వారు విద్యార్థులు తో అన్నారు . ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పెద్దలు, హై స్కూల్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, సత్యసాయి ఖమ్మం సమితి కన్వీనర్ ఆలస్యం నరసింహారావు, సాయి సుధాకర్, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page