చేవెళ్ల: ఆలయానికి వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలి: సీఐ లక్ష్మారెడ్డి

Spread the love

సాక్షిత శంకర్‌పల్లి: మహాశివరాత్రి సందర్భంగా చేవెళ్లలోని శ్రీ బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలని సీఐ లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యూ లైన్ పాటించి స్వామివారిని దర్శించుకోవాలని తెలిపారు. పార్కింగ్ కొరకు ఏర్పాటు చేసిన ప్రదేశంలోనే వాహనాలను పార్క్ చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉన్న అందుబాటులో ఉన్న పోలీసులను సంప్రదించాలని కోరారు. దొంగలు ఉంటారు జాగ్రత్తగా ఉండాలని భక్తులకు సీఐ తెలియజేశారు

Related Posts

You cannot copy content of this page