ప్రపంచ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ను సన్మానించిన కార్పోరేటర్ నిమ్మల వెంకట రమణ”

Spread the love

గుంటూరు:

అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డుల గ్రహీత,బ్యాడ్మింటన్ పూర్వ వరల్డ్ నెం.1 ఛాంపియన్ కిడాంబి శ్రీకాంత్ ను గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులు, 18వ డివిజన్ కార్పోరేటర్ నిమ్మల వెంకట రమణ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నిమ్మల వెంకట రమణ బ్యాడ్మింటన్ క్రీడలో ప్రపంచ స్ధాయిలో శ్రీకాంత్ మన దేశానికి ఎన్నో పతకాలు సాధించి గర్వకారణంగా నిలిచారని ఇలాంటి యువ క్రీడాకారులు మన గుంటూరు నగరంలో, మన 18వ డివిజన్ వాస్తవ్యులవ్వడం ఎంతో ఆనందదాయకం అని తెలిపారు.

నిమ్మల వెంకట రమణ చేతులమీదుగా కిడాంబి శ్రీకాంత్ ని దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ తండ్రి కిడాంబి కృష్ణ, సచ్చు రాంబాబు, జీ.శ్రీనివాసరావు, యూసఫ్ చంటి, సందీప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page