గణేష్ నగర్ లో పోచమ్మ, రేణుక ఎల్లమ్మ, వినాయక, శివాలయాల నిర్మాణం: కౌన్సిలర్ బిసోళ్ళ సంధ్యారాణి అశోక్ కుమార్

Spread the love

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ నగర్ కాలనీలో నూతనంగా పోచమ్మ, రేణుక ఎల్లమ్మ, వినాయక, శివాలయాలను నిర్మిస్తున్నట్టు మాజీ జెడ్పిటిసి, రెండవ వార్డు కౌన్సిలర్ బిసోల్ల సంధ్యారాణి అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయాలను నిర్మించడానికి స్లాబ్ వేశామని ఆలయ స్థలదాత, నిర్మించు వారు, సంధ్యారాణి అశోక్ కుమార్ అన్నారు.

అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ తన గణేష్ నగర్ వార్డును ప్రజలు ఆకాంక్షించిన రీతిలో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సొంత నిధులతో ఆలయాలను నిర్మిస్తున్నట్టు కౌన్సిలర్ తెలియజేశారు. కార్యక్రమంలో నటరాజ్, నరేష్, పూర్ణ, శ్రీను, కిషోర్, శివ, మధు, లక్ష్మణ్, ఎల్లయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page